1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. PM Modi Departs For Russia To Attend Key BRICS Meeting

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi
16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఇతర సభ్య దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నారు. అలాగే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
కజాన్ నగరంలో జరిగే ఈ 16వ బ్రిక్స్ సదస్సు ఈ దఫా అత్యంత కీలకంగా మారింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గత యేడాదిన్నర కాలంగా సాగుతున్న యుద్ధంతో ఇజ్రాయేల్ - పాలస్తీనా  - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం.. మధ్య ఆసియా దేశాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగబోతుంది. దీంతో ఈ దఫా బ్రిక్స్ సదస్సుకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. 
 
కాగా, బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి రష్యా అధినేత పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపిన విషయం తెల్సిందే. కాగా ఈ యేడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ 'ను అందుకున్నారు. 
తర్వాతి కథనం
అనంతపురంలో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్‌