సంబంధిత వార్తలు
- రజనీకాంత్కు సీఎం ఛాన్స్ లేదట... ఎందుకంటే?
- కామాంధుల వేధింపులు భరించలేను.. పిల్లలను చంపి సూసైడ్ చేసుకుంటున్నా
- పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?
- పారిపోయాననుకున్నారు... వాటికోసమే వెళ్లా... నటుడు విజయ్ భార్య వనిత
- భార్య విడాకులిచ్చిందని.. 80 మాత్రలు మింగేశాడు..
మనశ్శాంతి లేదనీ స్వామీజీ సూసైడ్ .. ఎక్కడ?
సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? తాజాగా ఓ స్వామీజీ మనశ్శాంతి లేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? తాజాగా ఓ స్వామీజీ మనశ్శాంతి లేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లా శిహట్టి తాలూకాలోని బాలేహోసూరులో ఉన్న దింగాలేశ్వర మఠంలో జరిగింది.
ఈ మఠంలో ఉండే మహాలింగ స్వామీజీ (38) మనశ్శాంతి దక్కలేదన్న కారణంతో ఆదివారం అర్థరాత్రి సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ విషయాన్ని సోమవారం ఉదయం ఆశ్రమానికి వచ్చిన కొంతమంది భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.
తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా తాను మనశ్శాంతిని కోల్పోయానని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. పైగా, తనన భౌతికకాయాన్ని మఠంలోనే సమాధి చేయాలని కోరారు.
