1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (09:12 IST)

రాహుల్ గాంధీని దేశద్రోహి అంటారా? బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

priyanka gandhi
ఇటీవల పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబాన్ని 'మీర్‌ జాఫర్‌' అని అవమానించినా, వారి రక్తంతో ప్రజాస్వామ్యాన్ని పోషించే వారసత్వం తమ కుటుంబానికి ఉందని, తాము తలవంచబోమని ఆమె పేర్కొన్నారు.
 
మార్చి 24న మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ ఈ అంశంపై మౌనం వీడారు. అదానీ గ్రూప్‌పై ఆందోళనలు చేసినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ అనర్హత వేటు వేసిందని ఆరోపించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తాము పోరాడతామని ఆమె నొక్కి చెప్పారు. 
 
అదానీ గురించి మాట్లాడినందుకే తన సోదరుడు అనర్హుడయ్యాడా అంటు ప్రశ్నించారు. "అదానీ సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. మా కుటుంబం ఈ దేశానికి అమరవీరుల ను అందించింది. మేము వెనక్కి తగ్గము, పోరాడుతాము" అని ఆమె అన్నారు. దేశం కోసం అమరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి ఎలా అంటారని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.