1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Two terrorists killed Baramulla

బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Baramulla
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు మృత్యువాతపడ్డారు. 
 
బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ సమీపంలో ఉన్న వార్పోరాలో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌తోపాటు పలువురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 
 
అ క్రమంలో టెర్రరిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భాగ్యనగరిపై ముసురు : వీడని వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే