శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (13:45 IST)

ఎన్నారై, తెరాస అధికార ప్రతినిధి అమెరికాలో దుర్మరణం: హత్యా, ప్రమాదమా?

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ప్రముఖ నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) దేవేందర్ రెడ్డి నల్లమడ న్యూజెర్సీలోని ఎడిసన్‌లో మంగళవారం (డిసెంబర్ 29) హత్యకు గురైనట్లు సమాచారం. ఈయన ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు ఎటువంటి వివరాలను విడుదల చేయలేదు.

మంగళవారం రాత్రి దేవేందర్ రెడ్డి సెల్ ఫోనులో మాట్లాడుతున్నారనీ, తన కారులో కూర్చుని మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించి మరణించాడని చెపుతున్నారు. అతడి మరణానికి కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
 
దేవేందర్ రెడ్డి కూర్చున్న ఎర్ర కారు ఫోటో, కారు విండో షీల్డ్స్ చిన్న పేలుడుగా విరిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. విండ్‌షీల్డ్‌లు విరిగిపోయిన కారు ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. దేవేందర్ రెడ్డి అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారిక ప్రతినిధి. అతను తన స్నేహపూర్వక స్వభావానికి మరియు బాధలో ఉన్న ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అమెరికన్ తెలంగాణ సొసైటీ ఏర్పాటులో కూడా ఆయన చాలా చురుకుగా ఉన్నారు.
 
అమెరికాలోని తెలంగాణ ఎన్నారైల అన్ని వాట్సాప్ గ్రూపులపై ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ, దేవేందర్ రెడ్డి నల్లమడతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.