శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 2 డిశెంబరు 2020 (17:15 IST)

వైకుంఠ ఏకాదశిపై టిటిడి తీసుకున్న నిర్ణయం భేష్ - కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

ఈనెల 25వ తేదీ ముక్కోటి ఏకాదశి సంధర్భంగా పది రోజుల పాటు భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్సనం కల్పించడం ఆనందదాయకమన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. టిటిడి చేస్తున్న కార్యక్రమాల ద్వారా భక్తులకు మేలు కలగాలని కోరుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు మధ్యాహ్నం కంచి పీఠాదిపతి దర్సించుకున్నారు. 
 
ఆలయం వద్ద టిటిడి ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో అనేక వ్రత, పూజాది ఉత్సవాలను భక్తుల సంక్షేమం కోసం టిటిడి నిర్వహిస్తుండడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం సందర్భంగా పీఠాధిపతులను టిటిడి ఆహ్వానం మేరకు తిరుమలకు వచ్చామన్నారు. 
 
కార్తీక మాసంలో భగవద్గీత, సుందరకాండ పారాయణం, విరాటపర్వం ప్రవచనాన్ని ప్రతినిత్యం మండపంలో శివకేశవ విశేష పూజాది కార్యక్రమాలు టిటిడి నిర్వహిస్తోందన్నారు. కరోనా కాలంలో కూడా తిరుమలలో లోక కళ్యాణార్థం, భక్తుల ఆరోగ్యార్థం టిటిడి ఎటువంటి లోటు లేకుండా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.