సంబంధిత వార్తలు
- తిరుమలలో కుమార్తెలతో పవన్ కల్యాణ్.. సమ్మక్క-సారక్కలా వున్నారే.. (video)
- తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం
- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...
- అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ
- పవన్ కళ్యాణ్ కుమార్తెలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబం తిరుమల దేవదేవుడిని దర్శించుకున్న వేళ
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగులు.. శోభాయాత్ర ప్రారంభం
Umbrellas procession
హిందూ ధర్మార్థ సమితి గతంలో విరామం తర్వాత 2005 నుండి తిరుమలకు గొడుగుల సమర్పణ తిరుక్కుడై ఉత్సవం నిర్వహిస్తోంది. చెన్నై నగరం నుంచి శోభాయాత్ర ప్రారంభమయ్యే ముందు చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో 11 గొడుగులకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ధర్మార్థ సమితి ట్రస్టీలు వేదాంతం, ఆర్ఆర్ గోపాల్ పాల్గొన్నారు.
నగరంలోని పలు ప్రాంతాలను చుట్టి అక్టోబరు 4న సౌమ్య దామోదర పెరుమాళ్ ఆలయానికి, 5న ఆవడికి, 6న తిరువళ్లూరుకు, 7న తిరుచానూరుకు గొడుగులు చేరుకుంటాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు గొడుగులు సమర్పించిన అనంతరం ఈ ఊరేగింపు తిరుమలకు చేరుకుంటుంది.
అదే రోజున.. మిగిలిన తొమ్మిది గొడుగులను తిరుమల దేవస్థానం అధికారులకు అప్పగించనున్నారు. సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఉత్సవం నిర్వహిస్తున్నామని, విరాళాలు, నైవేద్యాలు ఏ రూపంలోనూ స్వీకరించబోమన్నారు.
