సంబంధిత వార్తలు
- సంక్రాంతి స్పెషల్ : నేతి అప్పాలు
- లాలూకు రాజ మర్యాద: పప్పు, స్వీట్స్, బాస్మతి బియ్యం అన్నం, కాఫీలిచ్చి?
- మధుమేహ వ్యాధిగ్రస్థులు బోర్న్విటా, కాంప్లాన్ తీసుకోకూడదట..
- హోం మంత్రి చినరాజప్ప అంటే భయపడుతున్న షుగర్ పేషెంట్లు... ఎందుకో తెలుసా?
- వర్షాకాలం, చలికాలంలో స్వీట్లు వద్దే వద్దు.. నాన్ వెజ్ తగ్గించండి..
సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్ను పంచదార సిరప్లో చేర్చి పది నిమిషాల
పండగ వేళ సంప్రదాయ వంటకాలతో పాటు స్వీట్లు ముందే సిద్ధం చేసుకుని స్నేహితులు, బంధువులకు పంచిపెట్టాలనుకుంటున్నారా..? అయితే నోరూరించే రసమలాయ్ స్వీటును ఇంట్లోనే తయారు చేసి.. మీ స్నేహితులకు పంచిపెట్టండి. సంక్రాంతికి వెరైటీగా రసమలాయ్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
పాలు- ఒక లీటర్
పంచదార పొడి - 200 గ్రాములు
ఏలకుల పొడి - ఒక టీ స్పూన్
పనీర్ - 350 గ్రాములు
కుంకుమ పువ్వు -రెండు చిటికెలు
పిస్తా - అలంకరణకు
తయారీ విధానం :
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్ను పంచదార సిరప్లో చేర్చి పది నిమిషాలు ఉడికించాలి. పాలను బాగా మరిగించి రబ్రీ చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు చేర్చాలి. ఈ మిశ్రమంలో పనీరు ఉండలను చేర్చి పిస్తాతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
