సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు
సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం.. అంటే ఉత్తరాయణం. ఈ సమయంలో గీతలతో వేసే రథం ముగ్గు సూర్యుని ప్రయాణానికి ప్రతీక. గీతల ముగ్గుల్లో త్రిభుజాలు, చతురస్రాలు, షడ్భుజాలు వంటి ఆకృతులు ఉంటాయి. ఇరువైపులా సమానంగా ఉండే ఈ గీతల ముగ్గుల ఆకృతులు జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తాయి.
గీతల ముగ్గుల్లో పువ్వులను తీర్చిదిద్దుతారు. ఈ పువ్వుల్లో అష్టైశ్వర్యాలకు నిలయమైన మహాలక్ష్మి వుంటుందంటారు. గీతలతో వేసే ముగ్గుల్లో వివిధ రకాల చిహ్నాలు కూడా కనబడుతుంటాయి. ముగ్గులో గోపురంలా కనబడేది ఆకాశానికి ప్రతీక. ప్రకృతిని ఇలా గౌరవించడం ఈ సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా చెప్తారు.