1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Cheetah Wandering In Yacharam Mandal, People In Panic

యాచారాంలో చిరుతపులి కలకలం...

Cheetah
రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు కలకలం రేగింది. మండలంలోని పిల్లిపల్లి శివారు ప్రాంతంలో ఉన్న పొలంలో ఆవుదూడను చంపి ఆరగించింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
వారం రోజుల క్రితం మండలంలోని నానక్ నగర్‌లో చిరుతపులి సంపరించింది. ఈ నెల 8వ తేదీన మేకల మందపై దాడిచేసి ఓ మేకను చంపేసింది. అలాగే, గత యేడాది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జిలాపురంలో అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ఓ చిరుతపులి చిక్కుకుంది. దీన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని జూకు తరలించారు. ఇపుడు యాచారాంలో మరో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భీవండి వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం - రూ.100 కోట్ల ఆస్తి నష్టం