సంబంధిత వార్తలు
- లైట్ మెట్రో రవాణా బెటర్: టీటీడీ చైర్మన్ వైవీతో హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- వధువు తల్లితో వరుడి తండ్రి పరార్: ఔను వాళ్లిద్దరూ ఇప్పుడు తిరిగొచ్చారు
- సీఎం అయితే ఏంటి? 11 చార్జిషీట్లలో ప్రథమ నిందితుడు...
- హైదరాబాదులో మహిళా టెక్కీ ఆత్మహత్య, కారణం ఏంటి?
- పెళ్లి పేరుతో అమ్మాయిని వాడేసుకున్న యువకుడు...
హైదరాబాద్కు చేరుకున్న గల్ఫ్ బాధితులు... కేటీఆర్ దయవల్లే ఇక్కడకి...
నకిలీ ఏంజట్ల చేతిలో నిలువునా మోసపోయి అరబ్ దేశమైన ఇరాక్లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ వాసులు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్లో తమ వారిని చూసి బోరున విలపించారు. ఇరాక్లో చిక్కుకొని అనేక బాధలు పడ్డామని, తినడానికి తిండి లేక ఎన్నో రోజులు పస్తులు ఉండాల్సి వచ్చిందని, గత నాలుగు సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించామని మీడియాతో తమ గోడును వివరించారు.
ఇరాక్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిలువునా ఏంజట్లు మోసం చేసారని ఆరోపిస్తున్నారు. మమ్మల్ని తెలంగాణకు రప్పించడానికి తెలంగాణ మంత్రి కె. తారకరామారావు ప్రత్యేక చొరవ చూపారని ఆయన దయ వల్లే మేము క్షేమంగా హైదరాబాదుకు చేరుకున్నామని కన్నీరు పెడుతూ మీడియాకు వివరించారు.
తర్వాతి కథనం