సంబంధిత వార్తలు
- భార్య డెలివరీకి పుట్టింటికి వెళితే మరదలితో భర్త ఎంజాయ్, చివరికి?
- హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైలు... కేంద్రం గ్రీన్ సిగ్నెల్
- అబ్బా.. సైబర్ నేరాలు... ఏకంగా రూ.8లక్షల భారీ మోసం..
- శ్రావణి ఆత్మహత్య కేసు: వాళ్లిద్దరూ అరెస్ట్, ఆర్ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీ
- హైదరాబాద్లో వ్యాపారం బాగుందట... మకాం మార్చనున్న పాయల్!!
హైదరాబాద్లో 3.75 కోట్ల నగదు స్వాధీనం...
హైదరాబాద్ నగరంలో 3.75 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా హవాలా మనీగా గుర్తించారు. భాగ్యనగరంలో జరుగుతున్న హవాలా రాకెట్కు సంబంధించిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా హవాలా మార్గాల్లో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.3.75 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ నలుగురు వ్యక్తులు ముంబైకి చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తేలింది. ఆ సంస్థ యజమాని అహ్మదాబాద్కు చెందినవాడిగా తెలిసింది.
హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్కు నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కాగా స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.