1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Muchintal Samatha Murthy Entry Fees Hiked

సమతాస్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసం ఒక్కసారిగా రూ.50 పెంపు

samatha murthy
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించాలని భావించే పర్యాటకుల నుంచి నామమాత్రపు ప్రవేశ రుసుంను వసూలు చేస్తూ వచ్చారు. అయితే, ఇపుడు ఈ రుసుంను భారీగా పెంచేశారు. 
 
ప్రస్తుతం ఇక్కడ పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా వసూలు చేసేవారు. ఇపుడు దీన్ని రూ.200, రూ.125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సమతామూర్తి కేంద్రాన్ని తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలువు ప్రకటించడంతో ఆ రోజు మాత్రం అనుమతి లేదు. 
 
మరోవైపు, ఈ కేంద్రంలో ప్రధాన ఆకర్షణ అయిన డెనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శించనున్నారు. లీలానీరాజనం పేరుతో నిర్వహించే ఈ వాటర్ ఫౌంట్ షోను మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేడు మళ్లీ ఈడీ ముందుకు రాహుల్ - తొలి రోజు 10 గంటల విచారణ