తెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు కనిపించనున్నాయా? భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానంతో రెవెన్యూ శాఖలో అవినీతికి చెక్ పెడతామంటోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెవన్యూ శాఖలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు...