శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:53 IST)

నేడు భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ - ముఖ్య అతిథులుగా...

హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సాగర్ చంద్ర కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. దగ్గుబాటి రానా విలన్‌. రావు రమేష్, సముద్రఖని, నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు ఇతర పాత్రలను పోషించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. 
 
ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21వ తేదీ రాత్రి నిర్వహించాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ వేడుకను వాయిదా వేశారు. 
 
అయితే, ఈ నెల 23వ తేదీ బుధవారం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు నిర్వహించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 
 
మరోవైపు 'భీమ్లా నాయక్' ట్రైలర్‌ను సోమవారం రాత్రి రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏడు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. కాగా, ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు నటించగా, తమన్ సంగీతం సమకూర్చారు.