శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (18:11 IST)

కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ మూవీ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగులు జరిపే అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. 
 
ఆయన తాజాగా ఓ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమేనని చెప్పుకొచ్చారు.
 
ఇటీవల కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.
 
కాగా, పవన్ కళ్యాణ్ చేస్తున్న తాజా ప్రాజెక్టు వకీల్ సాబ్. ఇది బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. ఈ చిత్రం షూటంగ్ 70 నుంచి 80 శాతం మేరకు పూర్తయింది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.