గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (17:56 IST)

టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్

dasari kiran, ys jagan
dasari kiran, ys jagan
ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. AP ప్రభుత్వం అన్ని విభాగాలు మరియు రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ బోర్డును జాగ్రత్తగా ఏర్పాటు చేసింది.
 
టీటీడీ బోర్డుకు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. చాలా మంది బోర్డులో స్థానం సంపాదించడం తమ జీవితకాల ఆశయంగా తీసుకుంటారు. కానీ చాలా కొద్దిమందికి ప్రతిష్టాత్మకమైన అవకాశం లభిస్తుంది.
 
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి దాసరి కిరణ్ సన్నిహితుడు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి దాసరి కిరణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
 
“నేను జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని. ఈ నియామకంతో విధేయుడికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు” అంటూ దాసరి కిరణ్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.