సంబంధిత వార్తలు
- Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం
- Polavaram: రూ.45,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు పనులు.. జూన్ 2027 నాటికి పూర్తి
- కర్నూలు ఘటనపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు.. వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు..?
- Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్
- టెక్ దిగ్గజం గూగుల్ను ఎంచుకుంది... మీ సంగతేంటి..? దుబాయ్ టెక్ కంపెనీల సీఈవోలతో కీలక భేటీ
చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?
Chandrababu Naidu
బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్రమైన రాజకీయ వైరం ఉన్నప్పటికీ, పార్టీలకు అతీతంగా నాయకులు హరీష్ రావుకు సంతాపం తెలిపారు. ప్రస్తుతం తుఫాను మొంథా సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హరీష్ రావుకు తన సానుభూతిని ఎక్స్ ద్వారా తెలియజేశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా సంతాప సందేశాన్ని పంచుకున్నారు. సంవత్సరాల తరబడి రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు హరీష్ రావు తండ్రికి సంతాపం తెలపడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ చాలా కాలంగా టీడీపీని వ్యతిరేకిస్తూ వస్తోంది.
2023లో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో, బీఆర్ఎస్ నేతలు చేసిన సెటైర్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు మద్దతు ఇచ్చే నిరసనలను అప్పటి తెలంగాణ ప్రభుత్వం కఠినంగా నిర్వహించింది. అయితే, చంద్రబాబు నాయుడు రాజకీయ మర్యాదను కొనసాగించాలని ఎంచుకున్నారు.
2024 ఎన్నికల విజయం తర్వాత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) తుంటి ఎముక విరిగినప్పుడు ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తాజాగా హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
కాగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ, కేసీఆర్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. గౌరవ సూచకంగా, బిఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో తన ప్రచారాన్ని మంగళవారం నిలిపివేసింది.
