1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 17 డిశెంబరు 2021 (11:15 IST)

తగ్గేదేలే అంటూ ప్ర‌యోగాలు చేసిన బ‌న్నీ ''పుష్ప'

పుష్పరాజ్..  నీ అవ్వా తగ్గేదేలే ...అంటూ థియేటర్లలోకి వచ్చిన బన్నీ.. ఈ సినిమాతో చాలా ప్రయోగాలే చేశారు. యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 
 
 
ఈ సినిమాలో అన్నింటికంటే మొదటి చెప్పుకోవాల్సిన విషయం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్​. వీరిద్దరూ గతంలో 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు చేశారు. అవి రెండూ ప్రేమకథలే. ఇప్పుడు తీసిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప' మాత్రం అడవి బ్యాక్​డ్రాప్​లో తీసిన మాస్ ఎంటర్​టైనర్​. దీనిని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటం విశేషం.
 
 
అన్ని సినిమాల్లో స్టైలిష్​గా, హ్యాండ్సమ్​గా కనిపించిన బన్నీ 'పుష్ప'తో సాహసం చేశారు. లారీ డ్రైవర్​, డాన్​గా కెరీర్​లో ఎప్పుడూ చేయని పాత్రల్లో తొలిసారి కనిపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భుజం పైకెత్తి సరికొత్త మేనరిజమ్​తో కనిపించనున్నారు. తొలుత అందరూ దానిని పాత్రకు ఉన్న సమస్య అని అనుకున్నారు. కానీ తర్వాత బన్నీనే ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.
 
 
రంగస్థలం సినిమాతో తొలిసారి విలేజ్​ బ్యాక్​డ్రాప్​ కథ చేసిన డైరెక్టర్ సుకుమార్ బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టారు. తద్వారా తన బలం తెలుసుకున్న సుకుమార్ దాదాపు అలాంటి నేపథ్యంతోనే 'పుష్ప' తెరకెక్కించడం విశేషం. ఇక‌, ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో హీరోయిన్​గా మాత్రమే చేసిన సమంత, త‌న కెరీర్​లో తొలిసారి 'పుష్ప' కోసం స్పెషల్ సాంగ్ చేసింది. యూట్యూబ్​లో, సోషల్ మీడియాలో ఈ పాట సంద‌డి చేస్తోంది. 'ఊ అంటవా ఊహు అంటవా' అనే లిరిక్స్​తో పాట చాలా ఫేమస్​ అయింది.
 
 
ఈ సినిమా మొత్తం చిత్తూరు చంద్రగిరి నేపథ్యంగా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో నటీనటులు అందరూ చిత్రం ప్రారంభం కావడానికి ముందే ఆ యాసను నెలల పాటు ప్రాక్టీసు చేసి మరీ షూటింగ్​కు హాజరయ్యారు. మలయాళ విలక్షణ నటుడు ఫహాద్​ ఫాజిల్​ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో భన్వర్ సింగ్ షెకావత్​ అనే పోలీస్​ అధికారిగా ఆయన కనిపించనున్నారు. 'పుష్ప' తొలి భాగం ఆయన కొద్ది నిమిషాలే కనిపిస్తారని, రెండో భాగంలో మాత్రం పూర్తి నిడివి ఉన్న పాత్రలో అలరిస్తారని తెలుస్తోంది.
 
 
అల్లు అర్జున్​ గత చిత్రాలు చాలావరకు ఉత్తరాదిలో డబ్ అయ్యాయి. యూట్యూబ్​లో అవి ఒక్కొక్కటి వందల మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ బన్నీకి ఎక్కడలేని క్రేజ్​ తీసుకొచ్చాయి. మరి ఇప్పుడు 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాతో తొలిసారి అల్లు అర్జున్ అక్కడి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. శేషాచలం ఎర్ర చందనం, దాని స్మగ్లింగ్​ నేపథ్యంతో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.