సంబంధిత వార్తలు
- సమంతపై కోలీవుడ్ గుర్రు : ఆ వెబ్ సిరీస్ ప్రసారం నిలిపివేయాలంటూ..
- మదుమలై ఫారెస్ట్లోని ఏనుగులకు సోకిన కరోనా?
- ఫ్యామిలీ మ్యాన్ సీజన్ రివ్యూ.. ది ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా వుంది.. కరోనా వ్యాప్తే స్టోరీ!
- Happy Birthday Priyamani: ది ఫ్యామిలీ మ్యాన్ 2నే ప్రియామణికి స్పెషల్ గిఫ్ట్
- The Family Man Season 2: అరేయ్ కుక్కా, ఆమెను అలా పట్టుకుంటావేంట్రా?
చైనా: అలసిపోయిన గజరాజులు.. గాఢనిద్ర ఫోటోలు వైరల్
Elephant
జూన్ మూడో తేదీ నైరుతి చైనాలోని, యునాన్ ప్రావిన్స్లోకి దాదాపు 15 ఏనుగులు గుంపుగా .. జనవాసాల్లోకి వచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఆహారం కోసం జనవాసాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఆహారం కోసం 500 కిలోమీటర్లు నడక సాగించాయి. అయితే ప్రజలకు ఈ ఏనుగులు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు.
వీటిని చూసిన అధికారులు అడవుల్లోకి ఏనుగులను తరలించే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ ఛానెల్లో ఏనుగుల గుంపును అడవికి పంపే దృశ్యాలను లైవ్గా ప్రసారం చేసింది.
Elephant
అడవిలోకి వెళ్లే క్రమంలో 15 ఏనుగులు.. అలసిపోయి.. గాఢంగా నిద్రపోయాయి. ఆ గుంపులో పెద్ద ఏనుగులు నిద్రిస్తుంటే ఓ గున్న ఏనుగు ఆడుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
