శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:34 IST)

తితిదే షాకింగ్ నిర్ణయం: మళ్లీ శ్రీవారి ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన అర్చకులతో పాటు అర్చకులను సైతం తిరిగి తీసుకోవాలని, హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ప్రకటించింది.
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు. మొత్తమ్మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తున్న రమణదీక్షితుల శ్రమ ఫలించింది.