తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయానికి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గదులు కూడా సులభంగానే దొరుకుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు అయిపోవడంతో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఆదివారం సాయంత్రానికి శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 28 వే మంది మాత్రమే.