శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:46 IST)

ఎమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లలో స్తంభించిపోతున్నారు. కరోనా వైరస్ విజృంభణకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొరోనా ప్రభావానికి కారణం కల్కి అవతారం అని మరికొందరు చెప్పుకుంటున్నారు. మన దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 12,000కి చేరింది. 
 
దీనితో మరికొంతకాలం లాక్ డౌన్ పొడిగిస్తూ మే 3 వరకూ విధించారు. ఇక ఇప్పుడు జనంతో పాటు సెలబ్రిటీలు కూడా బాగా యాక్టివ్ గా వుంటున్నారు. తెలుగు సినిమాల్లో ఆమధ్య మెరిసిన ఎమీ జాక్సన్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. తను టాప్ మాత్రమే ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. నడుము కింద భాగానికి ల్యాప్ టాప్ అడ్డుపెట్టుకుని ఫోజిస్తూ ఫోటో పోస్ట్ చేయడమే కాకుండా ట్రౌజర్ లెస్ టైమ్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ఇపుడు దీనిపై కుర్రకారు కామెంట్లు చేస్తున్నారు.