ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (10:17 IST)

అట్టహాసంగా మేడారం జాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సారలమ్మ

మేడారం జాతర బుధవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ జాతర ఈ నెల19 వరకు జరుగనున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల కోసం సర్వం సిద్ధం అయ్యింది. సమ్మక్క కూతురైన సారలమ్మ .. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గద్దెలపై కొలువుదీరనుంది. 
 
రేపు కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు వేడుకగా తీసుకువచ్చి ప్రతిష్టించనున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున జనం మొక్కులను తీర్చుకోనున్నారు. ఇక శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.
 
మేడారం జాతరకు జిల్లా కలెక్టర్ ఆదిత్య కృష్ణ అధికారిక సెలవులు ప్రకటించారు. సమ్మక్క-సారక్క జాతర జరిగే ములుగు జిల్లా వరకు నాలుగు రోజులపాటు అధికారికంగా సెలవులు ప్రకటించారు. స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవులు ఇచ్చారు. 
 
అలాగే ఈ ఏడాది మేడారం జాతరకు ప్రతిసారి కంటే జనం ఎక్కువగా రావడంలో కొత్త రికార్డులను క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు హుండీ లెక్కింపుల్లో కూడా కొత్త రికార్డులు నమోదు చేసింది. 
 
ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. 2018 జాతరలో 10 కోట్ల 17 లక్షల 50 వేల 363 రూపాయలు హుండీ ఆదాయం రాగా.. ఈసారి ఇప్పటికే ఆ ఆదాయం కంటే ఎక్కువ వచ్చేసింది.