మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, కారణం ఏంటి?
తిరుపతి లోని మోహన్ బాబు యూనివర్శిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలకలం సృష్టిస్తోంది. ఐతే ఈ విద్యార్థిని కాలేజీ బైట ఓ ప్రైవేటు హాస్టల్లో వుంటోంది. ఈమె మంగళం ప్రాంతానికి చెందిన యువతి.
తను వుంటున్న హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీనితో ఆమెను హుటాహుటిని నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఐతే ఈ విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఏమిటన్నది తెలియాల్సి వుంది.