1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (14:14 IST)

విద్యార్థినిని తల్లిని చేసిన ఉపాధ్యాయుడు.. పలుమార్లు అత్యాచారం... చివరకు...

victim
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో ఓ దారుణ ఘటన జరిగింది. తన వద్ద చదువుకునే 16 యేళ్ల బాలికను కామాంధుడైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కదిరి నియోజకవర్గానికి చెందిన 16 యేళ్ల బాలిక తొమ్మిది నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా నీళ్లు తాగేందుకని స్టాఫ్ గదిలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు రెడ్డినాగయ్య అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని మిన్నకుండిపోయింది. 
 
అప్పటి నుంచి ఆ కామాధుడు.. ఆ విద్యార్థినిపై అవకాశం ఉన్నపుడల్లా అత్యాచారం చేయసగాడు. ఈ క్రమంలో గత శనివారం ఆ బాలికకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె నిండు గర్భవతిగా గుర్తించి, కాన్పు చేశారు.
 
అయితే, బాధితురాలికి రక్తం తక్కువ ఉండడంతో వైద్యులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించాలని సూచించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం వివరాలు వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.