1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (08:32 IST)

ఎన్టీఆర్ పేరొద్దు.. వంగవీటి రంగా పేరు పెట్టాలి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆగమేఘాలపై రాత్రికిరాత్రి అర్థరాత్రి జీవోలను రాజీచేసింది. ఈ జిల్లాల ఏర్పాటుతో పాటు.. వారి రాజధానులను కూడా ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. ముఖ్యంగా, విజయవాడ హెడ్ క్వార్టర్‌గా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడాన్ని వంగవీటి మోహన్ రంగా కుటుంబ సభ్యులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఉద్యమించిన మహానేత ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్షిస్తున్నారు. కానీ, వంగవీటి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గంలో పోటీ చేసిన వంగవీటి నారాయణరావు తనయుడు, బిజెపి నాయకుడు నరేంద్ర, ప్రజల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వంగవీటి మోహన రంగ పేరుతో జిల్లా పిలవాలని కోరారు. అలాగే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.