1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan Finalize three graduate MLC Candidates

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

ys jagan
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. వీరి ఎంపికపై ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత పిదప ముఖ్యమంత్రి జగన్ వారి పేర్లను ఖరారు చేశారు. 
 
విశాఖ - శ్రీకాకుళం - విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్, అనంతపురం - కడప - కర్నూలు స్థానానికి అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నెపూస గోపాల్ రెడ్డి కుమారుడు రవీంద్ర రెడ్డి, చిత్తూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్లను ఆయన ఖరారు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేశంలో కొత్తగా మరో 15 వేల కేసులు - 25 మంది మృతి