1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Today Triple IT Entrance Test Examination

నేడు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయ(ట్రిపుల్ ఐటీ) ఎంట్రెన్స్ టెస్ట్

Triple IT Entrance Test
హైదరాబాద్ నగరంలో ఉన్న రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి తెలిపారు. 
 
నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 4,400 సీట్లు ఉన్నాయన్నారు. 
 
ఈ సీట్ల కోసం 75,240 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 467, తెలంగాణలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 
తర్వాతి కథనం
గులాబ్ గుబులు - పలు రైళ్లు రద్దు - అప్రమత్తమైన అధికారులు