సంబంధిత వార్తలు
- డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో వ్యక్తి గల్లంతు
- భార్యకు మందు, గుట్కా అలవాటు.. అంతే భర్తే గొంతుపై కాలితో తొక్కి..?
- దంపతుల గొడవ.. భార్యపై భర్త దాడి.. 21 రోజుల బాబును అడ్డుపెట్టడంతో..?
- వంద ఛీత్కారాలవరకు భరిద్దాం అనుకున్నా. కానీః చంద్రబోస్
- మగపిల్లలు ఎందుకు పుట్టలేదంటూ చిత్రహింసలు.. ప్రాణాలు తీసుకుంటున్నా...
నేడు రాజీవ్గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయ(ట్రిపుల్ ఐటీ) ఎంట్రెన్స్ టెస్ట్
హైదరాబాద్ నగరంలో ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ చాన్స్లర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లు ఉన్నాయన్నారు.
ఈ సీట్ల కోసం 75,240 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 467, తెలంగాణలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
