1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Covid Media Bullitin

దేశంలో కొత్తగా మరో 14 వేల కరోనా పాజిటివ్ కేసులు

Covid 19
దేశంలో కొత్తగా మరో 14 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,348 మంది కోవిడ్‌బారిన పడ్డారు. మరో 805 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 13,198 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది.
 
ఇకపోతే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకోగా, మొత్తం రికవరీ కేసులు 3,36,27,632కి పెరిగాయి. 
 
మరోవైపు, ఇప్పటివరకు 1,04,82,00,966 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది. ఇక, కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,57,191గా ఉండగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,61,334గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పెళ్ళయ్యింది, శోభనం వద్దన్న భార్య, వెక్కి వెక్కి ఏడ్చిన భర్త, చివరకు?