శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (12:13 IST)

సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. గెలిచి తీరాల్సిందే...

ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్‌ టోర్నీలో పాకిస్థాన్ జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. బుధవారం భీకర ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేనిపక్షంలో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.  
 
ఈ పరిస్థితుల్లో ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగని న్యూజిలాండ్ జట్టుతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనుంది. ఆరు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి, మూడింట ఓడి, ఓ మ్యాచ్ రద్దవడంతో ఏడు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉన్న సర్ఫరాజ్ సేన.. విలియమ్సన్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది. 
 
మరి ఈ మ్యాచ్ గెలిచి పాక్ సెమీస్ రేసులో ఉంటుందా.. విజయాన్ని కివీస్‌కు కట్టబెట్టి నాకౌట్ బెర్త్ కన్ఫామ్ చేస్తుందో చూడాలి. ప్రపంచ కప్ టోర్నీల్లో ఇరు జట్లూ ఎనిమిది మ్యాచ్‌లలో తలపడగా, కివీస్ జట్టు ఆరు సార్లు, పాకిస్థాన్ జట్టు రెండు సార్లు విజయం సాధించింది.