తులసి ఆకులు, పసుపు, దాల్చిన చెక్క, లవంగం వేసి బాగా వేడి చేసి ఆ నీళ్లు తాగడం ద్వారా కరోనా లాంటి వైరస్ను దూరంగా వుంచవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులు, పసుపు యాంటీ బ్యాక్టీరియల్గా బాగా పనిచేస్తాయి. లవంగాలు గొంతు నొప్పిని కలిగించే బ్యాక్టీరియాలను అంతం చేస్తాయి. ఇక దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. ...