సంబంధిత వార్తలు
- ఆర్ఆర్ఆర్: అమెరికా సహా అనేక దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు?
- కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ 2021-22లో భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచిన 48 మంది భారతీయులు
- రాజమౌళి చెవిలో సీక్రెట్ చెప్పిన జేమ్స్ కేమరూన్
- ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలను పవన్ కళ్యాణ్ను అడిగేసిన బాలకృష్ణ
- ఇంటర్ పూర్తిచేసిన తెలంగాణ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగం!
కాలిఫోర్నియాలో మళ్లీ రక్తసిక్తం.. దుండగుడు కాల్పుల్లో ఏడుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత వినిపిస్తూనే వుంది. తాజాగా లాస్ ఏంజెలెస్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 11 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన మరిచిపోకముందే అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత వినిపించింది. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు సహా మొత్తం తొమ్మిది మంది చనిపోయారు.
ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బేలోని రెండు ప్రాంతాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ ఫామ్ రైస్ టకింగ్ సోయిల్ ఫామ్లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు
మరోవైపు, డెస్ మెయిన్స్లోని ఓ పాఠశాలలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల చనిపోగా, ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, కాల్పులు జరిపిన 20 నిమిషాల్లోనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
