గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (12:51 IST)

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే ఆఫర్...

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్‌ను ప్రకటించ

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ సంస్థకు ప్రధాన ప్రత్యర్థిగా రిలయన్స్ జియో అన్ని ప్లాన్లపై రోజుకు అర జీబీ అదనంగా ఇస్తూ రిపబ్లిక్ డే ఆఫర్‌ ప్రకటించింది. ఇపుడు పోటీ సంస్థ ఎయిర్ టైల్ సైతం ఈ దిశగా అడుగులేసింది. రూ.199 (28 రోజులు), రూ.448(82 రోజులు), రూ.509(90 రోజులు) ప్యాక్‌లపై ఇక నుంచి ప్రతీ రోజూ 1.4 జీబీ అధిక వేగంతో కూడిన డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ఇక అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంలో ఎటువంటి మార్పు లేదు. ఇక రూ.349 ప్లాన్‌లో ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా, 70 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.399 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా అందుతుందని ఎయిర్ టెల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.