గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (19:11 IST)

లోక్‌సభ లాస్ట్ డే.. : షాకిచ్చిన ములాయం.. మళ్లీ ప్రధానిగా మోడీ కావాలంటూ...

ప్రస్తుత లోక్‌సభకు చివరి రోజు గడిచిపోయింది. 2019-20 వార్షిక బడ్జెట్ కోసం సమావేశమైన ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశం, చివరి పనిదినం బుధవారంతో ముగిసింది. ఈ సభ సాక్షిగా సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఆ సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కర్నీ కలుపుకుని వెళ్తున్నారన్నారు. పైగా, ఆయన పాలన బాగుందన్నారు. అందువల్ల 2019లో కూడా మరోమారు ఆయనే ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికు లోనుకాగా, అధికార బీజేపీ సభ్యులు మాత్రం సంతోషంలో మునిగిపోయారు. అలాగే, తనపై సీనియర్ నేతగా ఉన్న ములాయం సింగ్ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మోడీ చిరునవ్వులు చిందించారు. 
 
తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారం. మోడీని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియా నిర్ఘాంత పోయి, ఆయన్నే చూస్తుండిపోయారు.