1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రోగి నో చెబితే ఐసీయూలో అడ్మిట్ చేయొద్దు : కేంద్ర కొత్త మార్గదర్శకాలు

icu ward
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 24 మందితో కూడిన నిపుణుల వైద్య బృందం రూపొందించిన ఈ మార్గదర్శకాలను తాజాగా వెల్లడించింది. ఇందులో రోగిని ఐసీయూలో చేర్చుకునే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. రోగి లేదా రోగి బంధువులు అడ్డు చెబితే రోగిని ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ఈ వైద్య బృందం రూపొందించిన మార్గదర్శకాల్లోని కీలక పాయింట్లను పరిశీలిస్తే, 
 
* ఐసీయూ చికిత్స వద్దనుకునేవారు లివింగ్ విల్‌ను రాతపూర్వకంగా తెలియజేస్తే ఆ విభాగంలో చేర్చుకోరాదు. 
 
* వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారి ఆరోరగ్యం ఏమాత్రం మెరుగుపడే అవకాశం లేనపుడు వారిని ఐసీయూలో ఉంచడం ఉపయోగం లేదు. 
 
* ఐసీయూ కోసం ఎదురుచూస్తున్న రోగులు రక్తపోటు, శ్వాసరేటు, హృదయ స్పందన, శ్వాసతీరు, ఆక్సిజన్ శాచురేషన్, మూత్రపరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి. 
 
* గుండె లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో సమస్యలు ఉన్న రోగులను ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలను పరిగణించాలి. 
 
* తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి. 
 
* మహమ్మారులు, విపత్తుల సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అశంపై నిర్ణయం తీసుకోవాలి.