1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (20:16 IST)

నేను ప్రాణాలతో రాగలిగాను.. మీ సీఎంకు థ్యాంక్స్ : ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా నిలిచిపోయింది. భద్రతా వైఫల్యంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లకుండానే వెనక్కి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఇది కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. నిరసనకారులు ఆయన ప్రయాణిస్తున్న రోడ్డు మార్గాన్ని నిర్బంధించడంతో మోడీ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతిపెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ ఆ ఫ్లైఓవర్ నుంచి భతిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంర్భంగా ఆయన ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడుతూ, "భతిండా ఎయిర్‌పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్" అని అన్నారు. మరోవైపు, ఈ ఘటన వల్ల ఫిరోజ్‌పూర్‌లో ఆయన చేపట్టాల్సిన ర్యాలీ రద్దు అయింది.