1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (18:14 IST)

11 టన్నుల టమాటాలతో వెళ్లిన లారీ మాయం.. గుండెలు బాదుకున్న..?

Tomato
కొండెక్కిన టమాటా ధరలతో వాటిని పండించిన రైతులు.. కోటీశ్వరులు అవుతున్న ఘటనలు అనేకం. అయితే టమాటాల ధర భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు ఎక్కువైపోయాయి. తాజాగా టమాటా లోడుతో వెళ్తున్న లారీ మాయం కావడంతో ఓ వ్యాపారి గుండెలు బాదుకుంటున్నాడు. రూ. 21 లక్షల విలువైన 11 టన్నుల టమాటాలతో వెళ్తున్న లారీ కనిపించకుండా పోవడంతో ఆ వ్యాపారికి ఏం చేయాలో తోచక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. 
 
కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నుంచి మునిరెడ్డి అనే ఓ వ్యాపారికి చెందిన టమాటాల లోడుతో వెళ్లిన లారీ మాయం అయ్యింది.  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీని మునిరెడ్డి అద్దెకు తీసుకున్నాడు. ఇందులో టమోటాలను పంపాడు. జీపీఎస్ ట్రాక్ కూడా అందుకు అమర్చాడు.
 
అయితే భోపాల్ టోల్ గేట్ వద్ద లారీ మాయమైంది. ఆపై లారీ డ్రైవర్ ఫోన్ కూడా స్వీచ్ఛాప్ కావడం ఆ రైతు గుండెలు బాదుకుంటున్నాడు. 15 కిలోల బరువున్న ఒక్కో బాక్సును రూ.2000 నుంచి రూ. 2150 ధర పెట్టి కొనుగోలు చేసినట్లు మునిరెడ్డి వివరించాడు. మొత్తం 11 టన్నులకు రూ. 21 లక్షలు చెల్లించానని వాపోయాడు. మునిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.