శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:43 IST)

కస్టమర్లతో వ్యభిచారం చేయలేదనీ రిసార్ట్స్ రిసెప్షనిస్ట్ హత్య

uttarakhand victim
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత కుమారుడు ఒకడు దారుణానికి పాల్పడ్డాడు. తన రిసార్టులో రిసెప్షనిస్టుగా పని చేసే 19 యేళ్ళ యువతిని రిసార్టుకు వచ్చే కస్టమర్లతో వ్యభిచారం చేయాలని బలవంతం చేశాడు. వేధించాడు. అయినప్పటికీ ఆ యువతి సమ్మతించలేదు. దీంతో రిసార్టు మేనేజర్‌తో కలిసి బీజేపీ నేత కుమారుడు ఆ యువతిని కాలువలో తోసి చంపేశాడు. తన స్నేహితురాలికి మృతురాలు పంపింపిన ఓ ఆడియో, మెసేజ్‌ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత కుమారుడు పులకిత్ ఆర్య, ఆ టీనేజి అమ్మాయి పనిచేస్తున్న రిసార్టు మేనేజర్ సౌరభ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి మృతదేహాన్ని ఈ ఉదయం ఓ కాలువ వద్ద గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఆ యువతి తన స్నేహితురాలికి పంపినట్టుగా భావిస్తున్న వాట్సాప్ సందేశాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను వేశ్యగా మార్చేందుకు రిసార్టు వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆమె తన సందేశాల్లో పేర్కొంది. 
 
రూ.10 వేలు చెల్లించిన కస్టమర్లకు 'ప్రత్యేక సేవలు' అందించాలని రిసార్టు యాజమాన్యం తనను ఒత్తిడికి గురిచేస్తోందని ఆమె వెల్లడించింది. పైగా, రిసార్టులో ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నందున ఆ విషయాన్ని పట్టించుకోవద్దని రిసార్టు యాజమాన్యం చెప్పిందని ఆమె తన సందేశంలో వివరించింది.