సంబంధిత వార్తలు
- 19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...
- 13-04-202 శనివారం దినఫలాలు - పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు...
- నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు... ఉదయం 11 గంటలకు..
- 12-04-2024 శుక్రవారం దినఫలాలు - దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి...
- 06-04-2024 శనివారం దినఫలాలు - స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు...
ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు
ధనం రాబడి కోసం, ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. శుక్రవారంలో వచ్చే శుక్ర హోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లాలి. ఆలయంలో రావిచెట్టు వుండేలా చూసుకోవాలి.
రావిచెట్టు కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం వుంటే ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును 108 సార్లు శుక్ర హోరలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షణలు చేసే సమయంలో "ఓం లక్ష్మీ గణపతియే నమో నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షణలు చేయాలి.
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9 గంటలను శుక్రహోరగా పరిగణిస్తారు. ఈ శుక్రహోరలో శుక్రవారం రావిచెట్టు కింద కొలువైన వినాయకుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ధనాదాయం వుంటుంది. సర్వశుభాలు సిద్ధిస్తాయి.
Peepal Tree
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7 గంటల సమయంలో వినాయకుడిని 108 సార్లు ప్రదక్షణలు చేయడం అలాగే శనివారం (20-04-2024) మధ్యాహ్నం 12-1 గంట లోపు వినాయకుడిని ప్రదక్షణలు చేసి.. 16 నెయ్యి దీపాలను వెలిగించి.. పై మంత్రాన్ని పఠించడం ద్వారా కచ్చితంగా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, ధాన్యాలకు కొదవ వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
