1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (12:17 IST)

సాకర్ మైదానంలోకి ధోనీ: అభిషేక్ బచ్చన్ లుంగీతో సందడి!

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాకర్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో తాను సహ యజమానిగా వ్యవహరిస్తున్న చెన్నయిన్ జట్టుకు మద్దుతు పలికేందుకు మంగళవారం చెన్నైకి వచ్చిన ధోని మైదానంలోకి దిగి కాసేపు అభిమానులను అలరించాడు.
 
చెన్నై పుట్ బాలర్లతో కాసేపు మ్యాచ్ ఆడి.. గోల్ కీపర్‌గా కాసేపు అవతారం ఎత్తాడు.  చెన్నై జట్టు మరో సహాయజమాని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తమిళనాడు తరహాలో లుంగీ ధరించి తొడగొట్టాడు. ఇక మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5-1తో ముంబై సిటీని చిత్తు చేసింది.