గేమ్స్ విలేజ్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!
గేమ్స్ విలేజ్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చెఫ్ డి మిషన్ అడిలి సుమారివాలా ఆధ్వర్యంలో గేమ్స్ విలేజ్లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐఓఏ ఉపాధ్యక్షుడు తర్లోచన్ సింగ్, మహిళల హాకీ జట్టుతో కలిపి 50 మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అథ్లెట్లకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై సుమారివాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మయన్మార్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, చైనీస్ తైపీ, పాలస్తీనా పతాకాలను కూడా ఆవిష్కరించారు.