1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TDP Chief Chandrababu will attend Khammam rally Today

నేడు తెలంగాణాలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు

chandrababu
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. శంఖారావం పేరిట నిర్వహించే ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరం నుంచి భారీ వాహనశ్రేణిలో వెళతారు. ఈ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ మైదానంలో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.
 
నిజానికి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు, ఆ తర్వాత మరికొందరు తెరాస పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇపుడు టీడీపీలో చెప్పుకోదగిన సీనియర్ నేతలులేరు. ఉన్నవారంతా చోటామోటా నేతలే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగా, బుధవారం ఖమ్మంలో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సభ కోసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
అల్లూరి జిల్లాలో గంజాయితో పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు