సంబంధిత వార్తలు
- హిందీలో ఎంబీబీఎస్ కోర్సులు.. అపూర్వ ఘట్టమన్న అమిత్ షా
- ఇక.. హిందీలో వైద్య విద్యా కోర్సు బోధన.. పుస్తకాలు విడుదల
- అందరిముందూ దుస్తులు విప్పించిన టీచర్.. ఒంటికి నిప్పంటించుకుని..?
- టీచర్ అవతారం ఎత్తిన వైసీపీ నేత.. చాక్ పీస్తో బోర్డుపై రాస్తూ..?
- ట్యూషన్కు వచ్చిన విద్యార్థితో టీచరమ్మ ప్రేమ... పెళ్లి కుదరడంతో...
చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదాలా?
ఓర్పుతో వుండాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపాటి తప్పుకే విద్యార్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను టీచర్ చితకబాదింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. టీచర్ రాజ్యలక్ష్మి చెప్పులకు మట్టిందని ఆరుగురు విద్యార్థులను కర్రతో గొడ్డును బాదినట్లు బాదింది. దీంతో విద్యార్థులకు గాయాలైనాయి. మానకొండూరు గ్రామంలో వర్షాల కారణంగా బురదమయం అయ్యింది. దీంతో విద్యార్థులు బురదలోనే నడవాల్సిన పరిస్థితి.
ఇలా చెప్పులకు బురద అంటుకుంటోంది. దీన్ని చూసిన టీచర్ వారిపై విచక్షణా రహితంగా ప్రవర్తించింది. కర్ర తీసుకుని విద్యార్థులను చితకబాదింది. విద్యార్థులను అకారణంగా చితకబాదిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు హెచ్ఎంను డిమాండ్ చేస్తున్నారు.
తర్వాతి కథనం
