1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana : 3.6 Magnitude Earthquake Jolts Sangareddy

సంగారెడ్డిలో భూప్రకంపనలు... పరుగులు పెట్టిన జనం

earthquake
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో భూప్రకంపనలు కనిపించాయి. కోహిల్ మండలం బిలాల్‌పూర్‍‌లో భూమి ఒక్కసారిగా కంపించగానే జనం ఉలిక్కిపడుతూ పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ భూప్రకంపనలు మంగళవారం వేకువజామున 3.20 గంటల సమయంలో సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో నమోదయ్యాయి. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలోనూ, భూగర్భంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గతంలో జనవరిలోనూ కోహిర్ మండలంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు కనిపించిన విషయం తెల్సిందే.
About Writer
వరుణ్
తర్వాతి కథనం
శృంగారానికి మైనర్ బాలిక సమ్మతించినా అది అత్యాచారం లెక్కే : ఢిల్లీ హైకోర్టు