1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TET results in Telangana will release on July 1st

వచ్చేనెల ఒకటో తేదీన టెట్ పరీక్షా ఫలితాలు

sabita indra reddy
తెలంగాణా రాష్ట్రంలో టెట్ పరీక్షా ఫలితాలను వచ్చే నెల ఒకటో తేదీన వెల్లడించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె మంగళవారం ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉర్హత పరీక్షా ఫలితాలను వెల్లడించే తేదీని కూడా ప్రకటించారు. 
 
నిజానికి ఈ టెట్ ఫలితాలు ఈ నెల 27వ తేదీ సోమవారం వెల్లడి కావాల్సివుంది. కానీ సోమవారం రాత్రి వరకు ఈ ఫలితాలను వెల్లడించలేదు. 
 
ఈ నేపథ్యలో మంగళవారం ఈ విషయంపై దృష్టిసారించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ ఒకటో తేదీన ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఈ టెట్ పరీక్షల్లో భాగంగా, మొదటి పేపర్‌కు 318506 మంది, రెండో పేపర్‌కు 251070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి శాంతి మంత్రం - మాట్లాడుకుందాం రండంటూ కబురు