బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (15:17 IST)

రాఖీ సావంత్ లింగమార్పిడితో అమ్మాయిగా మారింది: తను శ్రీ

ప్రముఖ దర్శకుడు నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తనూశ్రీదత్తా పైకి చూడ్డానికి మాత్రమే అమ్మాయని.. లోపల అన్నీ మగ బుద్ధులేనని రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మహిళ కాదని లింగమార్పిడితో ఆమె అమ్మాయిగా మారిందంటూ తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. 
 
ఈ విషయంలో చాలామంది తనుశ్రీకి మద్దతు తెలుపగా, రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ.. రాఖీ సావంత్ ట్రాన్స్ జెండర్ అని, ఈ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని వెల్లడించింది. 
 
మీ టూ ఉద్యమం ప్రభావం తగ్గినా.. ప్రజల మైండ్‌లో ఎప్పటికీ నిల్చుండి పోతుందని తనుశ్రీ దత్తా తెలిపింది. మీ టూ ఉద్యమంపై చాలామంది హీరోయిన్లు నోరు విప్పుతారని భావించాను. కానీ హీరోయిన్లు మిన్నకుండిపోవడం తనను నిరాశకు గురిచేసిందని, స్వరభాస్కర్, కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు మహిళల కోసం నోరు విప్పేందుకు జడుసుకోవట్లేదని.. మరికొందరైతే ఫిర్యాదులకు భయపడి.. మీటూ ఉద్యమానికి ముందుకురావట్లేదని.. తనుశ్రీ దత్తా తెలిపింది.