గర్భస్థ శిశువును కూడా డిస్టబ్ చేస్తోన్న రింగ్ టోన్!
అమ్మ కడుపులోని గర్భస్థ శిశువు సెల్ ఫోన్ రింగ్ టోన్కు ఉలిక్కిపడుతుందని తాజా పరిశోధనలో తేలింది. దీంతో సెల్ ఫోన్ రింగ్ టోన్ గర్భస్థ శిశువును కూడా డిస్టబ్ చేస్తోందని పరిశోధకులు అంటున్నారు. అమ్మ కడుపులో వెచ్చగా నిద్రిస్తున్న శిశువు సెల్ ఫోన్ రింగ్ టోన్ ఉలిక్కిపడేలా చేస్తోంది.
అలాగే సెల్ ఫోన్ను పొట్టకు దగ్గరగా ఉంచడం వల్ల అది చేసే శబ్ధాలు గర్భస్థ శిశువును ఆందోళనకు గురిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. వైబ్రేషన్తోనూ ఈ ప్రభావం తప్పదని, దీంతో పిండం స్లీప్ సైకిల్ దెబ్బతింటుందని వివరించారు. పిండం నిద్రిస్తున్నప్పుడు సెల్ఫోన్ మోగితే ఉలికిపాటు లేస్తుందని పరిశోధకులు తెలిపారు.
అందుచేత సెల్ ఫోన్స్ ఉపయోగించే మహిళలు గర్భస్థ శిశువును కూడా డిస్టబ్ చేయకుండా వినియోగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కడుపు దగ్గరగా కాకుండా కాస్త దూరంగా సెల్ ఫోన్ను వుంచాలి. వైబ్రేషన్, రింగ్ టోన్స్ సౌండ్ తగ్గించాలి. వీలైతే సైలెంట్ మోడ్లో పెట్టేసి అప్పుడప్పుడు సెల్ ఫోన్ను చెక్ చేసుకోవాలి. లేకుంటే గర్భిణీ మహిళ నిద్రించేంతవరకైనా సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలి. మొత్తానికి సెల్ ఫోన్లకు గర్భిణీ మహిళలు చాలామటుకు దూరంగా ఉండాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.
ఇంకా పరిశోధకులు ఏమంటున్నారంటే.. గర్భిణీ మహిళలు సెల్ ఫోన్లను అధికంగా వినియోగించడం ద్వారా పుట్టే పిల్లల అలవాట్లలో మార్పులుంటాయని తెలిపారు. ఇప్పటికే సెల్ఫోన్ల వాడకం ద్వారా క్యాన్సర్ ప్రమాదం పెద్దలో చాలామటుకు పెరిగిపోతోందని, పిల్లల మెదడుకు సెల్ ఫోన్తో రుగ్మతలు తప్పవని సూచిస్తున్నారు.