శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (10:00 IST)

ట్రస్ట్ స్వాధీనం కోసం ధూళిపాళ్ళ నరేంద్రకు సర్కారు నోటీసులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీచేసింది. తన ఆధీనంలో ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో నోటీసులు జారీ చేసింది. 
 
సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. 
 
పైగా ఈ నోటీసులు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. గతంలో కూడా గుంటూరులోని సంగం పాల డైరీని స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇదే విధంగా నోటీసు జారీచేసింది. ఆ తర్వాత సంగం డైరీ యాజమాన్యం న్యాయపోరాటానికి దిగిన విషయం తెల్సిందే.