1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. All set for APEAP CET in Andhra Pradesh,

ఏపీలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలను ఎంసెట్ రూపంలో నిర్వహించేవారు. ఇపుడు దీని పేరు మార్చారు. ఏపీఈఏపీ సెట్‌గా మార్చుతూ చర్యలు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించే ఏపీఈఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం కాకినాడ జేఎన్టీయూకి అప్పగించింది. ఆగస్టు 19 నుంచి ఏపీఈఏపీ సెట్ జరగనుంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష, సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
ఈ ఏడాది నిర్వహించే ఏపీఈఏపీ సెట్‌కు ఛైర్మన్‌గా కాకినాడ జేఎన్టీయూ వీసీ రామలింగరాజు వ్యవహరించనున్నారు. కాగా, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అభ్యర్థులకు కల్పించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఉపరాష్ట్రపతి - సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు : పంచ్‌ ప్రభాకర్‌పై కేసు నమోదు